
చిత్రసీమలో విజయవంతమైన కలయికలు చాలానే కనిపిస్తాయి. అందులో ఒకటి… చిరంజీవి – వి.వి.వినాయక్. ‘ఠాగూర్’, ‘ఖైదీ నంబర్ 150’తో వీరిద్దరు విజయాలు అందుకున్నారు.
చిరంజీవి కథానాయకుడిగా, వి.వి. వినాయక్ దర్శకత్వంలో మరో చిత్రం రూపొందబోతోందా? అంటే అవుననే అంటున్నాయి తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాలు. ఇటీవలే వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. ఓ రీమేక్ సినిమాపై కసరత్తులు జరుగుతున్నట్టు తెలిసింది.